గాంధీజీలో ప్రత్యేకత సత్యంతో చేసిన ఆయన ప్రయోగాలు

* డాక్టర్ దాసరి శ్రీనివాసులు,  ఐఎఎస్ (రిటైర్డ్)

గాంధీజీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను తన జీవితంలో నిరంతరం చేసిన ప్రయోగాలు. ఆయన  ఎప్పటికప్పుడు తనకు తానుగా నిజాయితీగా ఉంటూ అసంపూర్ణతల నుండి పరిపూర్ణత వైపు పయనించారు. అతని మొదటి ప్రయోగం,  అత్యంత విజయవంతమైన ప్రయోగం, నిస్సందేహంగా, తనతోనే చేసుకొనేవారు. ఆయన  ఆ ప్రయోగాలను “సత్యంతో నా ప్రయోగాలు” అనే పేరుతో వెలువడిన  తన   ఆత్మకథలో ఆయనే స్వయంగా వ్రాసుకున్నారు.

బాపుతో పరిచయం ఉన్న వారందరూ, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో సహా, ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని గ్రహించేవారు.  తన ఆత్మకథలో, గాంధీజీ తన బాల్యం గురించి చాలా వివరంగా రాశారు. ఆయన  బాగా సంపన్నమైన,  అత్యంత గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు. పాఠశాలలో, తాను ఒక సాధారణ విద్యార్థిని మాత్రమే అని ఆయన   తనను తాను ఒప్పుకున్నారు.

కఠినమైన శాఖాహారం కుటుంభం  నుండి వచ్చినప్పటికీ మాంసం తిన్నారు.  ధూమపానం చేయడానికి ప్రయత్నించారు.  జేబు ఖర్చుల కోసం సోదరుడి నుండి కొంచెం బంగారాన్ని దొంగిలించారు. ఇవి తనను శారీరకంగా,  నైతికంగా ప్రభావితం చేయడంతో ఆ  రెండింటినీ వదులుకున్నారు. 

 
 ఒకానొక సమయంలో, తాను స్వేచ్ఛను ఆస్వాదించలేక పోతున్నాననే అసంతృట్ఫితో, తన తల్లిదండ్రులు,  సమాజం అనుమతి లేకుండా ఏమీ చేయలేననే భావనతో ఆయన  ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనుకున్నంత  అంత సులభం కాదని గ్రహించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ఒకసారి ఆయన  వేశ్యల ఇంటికి వెళ్లి,  మంచం మీద ఉన్న ఓ స్త్రీ  దగ్గర కూర్చున్నాడు. అయితే అతనిలో విశ్వాసం కనిపించక పోవడం, భయపడుతూ ఉండడంతో ఆమె కోపంతో అతనిపై కేకలు వేసి అక్కడినుండి వెళ్లిపొమ్మని గదిమింది. 

 
 13 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్న ఆయనలో భౌతికమైన   ఆనందాల కోసం, తన భార్యపై మితిమీరిన అధికారాన్ని ఉపయోగించాలనే కోరిక ఉండెడివి. తరువాత బ్రహ్మచర్య మహిమను గ్రహించి, తన భార్యను సుఖ దుఃఖాలలో సమాన భాగస్వామిగా చూడటం ప్రారంభించారు.

తన తండ్రి మరణానంతరం, తన తండ్రి స్నేహితుని సలహాతో, బాపు ఇంగ్లాండ్‌లో బార్ చదవాలని నిర్ణయించుకున్నారు. మనల్ని ఆకర్షించే ఒక సంఘటన ఏమిటంటే, ఆయన  తన సామజిక వర్గం  నాయకుల ఆదేశానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్‌కు వెళ్లారు. 

 
ఎందుకంటే ఆయనకు చెందిన సామజిక వర్గం మోద్ బనియాల నుండి అప్పటి వరకు ఎవ్వరు విదేశాలకు వెళ్ళలేదు.  ఇలాంటి విషయాల్లో సామజిక వర్గం  నాయకులు జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. తనను కుల బహిష్కరణ చేస్తామని  బెదిరింపులకు పాల్పడినా బాపు చలించలేదు.
తన తల్లి విదేశీ పర్యటనకు అంగీకరించడంతో సంతోషంగా వెళ్లారు. అయితే  మద్యం,మహిళలు, మాంసం ముట్టుకోకూడదని ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే ఆమె అందుకు అంగీకరించింది. బాపు తన జీవితాంతం ఈ విషయాలలో తల్లి సలహాకు కట్టుబడి ఉండేవారు.
బాపు తన నిర్ణయాలు,  చర్యల విడదీయలేనివిగా ఉండాలని కోరుకున్నారు. తన నిష్కళంకమైన చిత్తశుద్ధితో ప్రత్యర్థులతో వ్యవహరించేటప్పుడు కూడా ఆయన  తీరు సున్నితంగా,  మర్యాదగా ఉండేది. తన  విశ్వాసాల నుండి అంతగా ప్రాధాన్యత లేక పోయినా తాను  ఏమాత్రం పక్కకు జరగడంను బాపు సహించేవారు కాదు.

గాంధేయ సిద్ధాంతం ప్రధాన సూత్రాలలో ఒకటి తనకు తానుగా నిజాయితీగా ఉండటం. “క్షణం క్షణానికి నాకు నేను నిజాయితీగా ఉంటే, నా ముఖంలో ఎగిరిపోయే అన్ని అసంపూర్ణతలను నేను పట్టించుకోను” అని దృఢ నిబద్ధతతో స్వయంగా అంగీకరించారు. 
 
కాబట్టి జీవితం పరిపూర్ణంగా ఉండటమే కాదు, గాంధీ నమ్మిన స్వీయ దిద్దుబాట్ల ద్వారా అసంపూర్ణతల నుండి దూరం కావడం. ఆయనలోని మరో అంశం ఏమిటంటే, విముక్తి కోసం మన తప్పును అంగీకరించగల సామర్థ్యం.  అది స్వచ్ఛమైన అహింస.

గాంధీజీ గురించి విమర్శనాత్మకంగా ఉండే  ప్రఖ్యాత రచయిత నీరజ్ చౌదరి ఆయన గొప్పతనం గురించి సంక్షిప్తంగా ఈ విధంగా చెప్పారు.  మహాత్మా, ‘మనిషి మరియు ప్రజానీకం ఒక్కటయ్యారు’.