కాబూల్లోని ఇంటర్కాంటినెంటల్ హోటల్లో ఓ కార్యక్రమం జరిగినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. యుద్ధం సమయంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడినవారి కుటుంబ సభ్యులతో సిరాజుద్దీన్ హక్కానీ సమావేశమైనట్లు తెలిపింది. హక్కానీ మాట్లాడుతూ, జీహాద్ను, అమరుల త్యాగాలను ప్రశంసించారు. వీరు ఇస్లాంకు, దేశానికి హీరోలని పేర్కొన్నారు.
తాలిబన్ అధికార ప్రతినిధి కరి సయీద్ ఖోస్టి మాట్లాడుతూ, ఆత్మాహుతి దాడులకు పాల్పడినవారి కుటుంబ సభ్యులకు బట్టలు, 111 డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు. వీరికి భూములు కూడా ఇస్తామని తెలిపినట్లు చెప్పారు. సిరాజుద్దీన్ హక్కానీ తన తండ్రి జలాలుద్దీన్ హక్కానీ నుంచి హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థ బాధ్యతలను స్వీకరించారు. ఈ సంస్థ తాలిబన్లకు అనుబంధంగా పని చేస్తోంది.
యుద్ధం సమయంలో అత్యంత కిరాతకమైన ఆత్మాహుతి దాడులకు ఈ సంస్థ పాల్పడినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సిరాజుద్దీన్ ఆచూకీ తెలియజేసినవారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది.

More Stories
లిపులేఖ్ పాస్ ద్వారా మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం!
ట్రంప్ కు `అసాధ్యమైన ఆపరేషన్’ లేదా `ఇరాన్ తో రాజీ’ మాత్రమే!
ప్రత్యేక డ్రోన్లతో ఇజ్రాయెల్ సైనికులపై హెజ్బొల్లా ఉగ్రవాదుల దాడి!