తమ మతానికి చెందిన ఉద్యోగినితో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న హిందూ వ్యక్తిపై కొందరు మతోన్మాదులు దాడికి పాల్పడ్డ ఘటన ఇందూరు జిల్లా జానకంపేటలో చోటుచేసుకుంది.
గిరిజన సామాజిక వర్గానికి చెందిన రవి అనే వ్యక్తి బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఆఫీసులోనే పనిచేస్తున్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళతో కలిసి ఈనెల 8వ తేదీన ఉద్యోగం రెగ్యులరైజేషన్ విషయమై నిజామాబాద్ వెళ్తుండగా, జానకంపేట సమీపంలో కొందరు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వీరి ద్విచక్ర వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మహిళతో తిరుగుతున్నావేంటి అని ప్రశ్నిస్తూ, వాహనం నడుపుతున్న రవిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అతన్ని సారంగపూర్ మలాపల్లిలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని కత్తులతో బెదిరించినట్టు సమాచారం.
ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న కొంత మంది హిందూ సంఘాల నాయకులు రవిని కలిసి అతనికి మనోధైర్యం అందించారు. వారి సహకారంతో తనపై దాడి చేసిన వ్యక్తులపై ఈ నెల 11న స్థానిక యెడపల్లి పోలీసు స్టేషన్ లో రవి ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడ్డ వారిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
More Stories
VIDEO: వీళ్ళు ఆటగాళ్లా? మతోన్మాదులా?
VIDEO: గుడికి అని చర్చికి తీసుకెళ్తున్నారు: జహీరాబాద్ స్కూల్లో మతమార్పిడులు
VIDEO: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆరెస్సెస్ పోరాటం