
కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.
తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రంలోగా ఆరు గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాజాను ఈసీ ఆదేశించింది.
ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులు ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
మరోవంక, పశ్చిమ బెంగాల్ లో ఓ సబ్ డివిజనల్ పోలీసు అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ అతనిపై బదిలీవేటు విధించింది. నందిగ్రామ్ లలో కొందరు పోలీసు అధికారులు టీఎంసీ అభ్యర్థుల ఎన్నికల అక్రమాలకు సహకరిస్తున్నారని, వారిని సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుడు సువెందు అధికారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎన్నికల కమిషన్ హల్దియా సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ బరూన్ బైద్యను తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఎస్డీపీఓ బరూన్ బైద్యను ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించరాదని ఈసీ ఆదేశించింది. ఆయన స్థానంలో ఉత్తమ్ మిత్రాను కొత్త హల్దియా ఎస్డీపీఓగా ఈసీ నియమించింది.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం