బ్రిటీష్ కాలం నాటి సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలను మారుస్తామని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దేశంలో బ్రిటీష్ కాలం నాటి చట్టాలే ఇంకా అమలు జరుగుతున్నాయని, ఆ చట్టాలను మార్చాలని కేంద్రం ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు.
త్వరలోనే సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలకు మార్పులు చేస్తామని, దీనికోసం సమాజంలోని కీలకమైన వ్యక్తులు, మేధావుల నుండి సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నగరంలోని బేగంపేట్ క్షత్రియ హోటల్ లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావ్ కు మద్దతు గా బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. టి ఆర్ ఎస్ పార్టీ జోరు మీద ఉన్నపుడు బీజేపీ ఎమ్మెల్సీ లు విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు విద్యావంతులు.. మేధావులు, ఉద్యోగులు ఆ పార్టీ కి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రామచంద్రరావు ఉద్యమంలో పోరాడిన వ్యక్తి, నీతి నిజాయితీ గా పని చేసే వ్యక్తి అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపిచ్చారు. ఈ కార్యకమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ రహత్కర్, రాష్ట్ర బీజేపీ మాహిళ మోర్చాఅధ్యక్షురాలు గీతా మార్తి పాల్గొన్నారు.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్