వెబ్లీ అండ్ స్కాట్ యూనిట్ హర్దోయి జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. ఇది నవంబరు నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఓ విదేశీ ఆయుధాల కంపెనీ భారత దేశంలో ఆయుధాలను తయారు చేయడం ఇదే మొదటిసారి.
రెండు ప్రపంచ యుద్ధాల్లో మిత్రపక్ష కూటమి దళాలకు ఆయుధాలను సరఫరా చేసిన ఘనత వెబ్లీ అండ్ స్కాట్ కంపెనీకి ఉంది. దాదాపు 15 దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తోంది.
ఈ కంపెనీ యూనిట్ ఉత్తర ప్రదేశ్లోని హర్దోయి జిల్లా శాండిలలో ఏర్పాటు చేస్తారు. సియాల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. మొదట్లో రివాల్వర్ల తయారీతో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. తొలి దశలో 32 రివాల్వర్లను తయారు చేస్తారు.
సియాల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రతినిథి జోగీందర్ పాల్ సింగ్ సియాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వపు ‘మేక్ ఇన్ తిష్ఠాత్మక బ్రిటిష్ ఆయుధాల తయారీ కంపెనీ వెబ్లీ అండ్ స్కాట్ (డబ్ల్యూ అండ్ ఎస్) త్వరలో ఓ యూనిట్ను ఏర్పాటు చేయబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

More Stories
17 శాతం ఎల్ఎన్జీ ఎగుమతుల సామర్థ్యం కోల్పోయిన ఖతార్
చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులతో భారత్ పై భారీ ప్రభావం
ఇరాన్తో యుద్ధానికి రూ.18.6 లక్షల కోట్లు కోరిన పెంటగాన్