విజయవాడలో జరిగిన నిరసనలో జిల్లా పరిషద్ మాజీ చైర్మన్, బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొంటూ ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. 15నెలల కాలంలో ఒక మతానికి అనుకూలమైన పాలన సాగుతుందని ఆరోపించారు.
వరుసగా ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటూ నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వమే మతి స్థిమితం లేని వారి పనిగా చెబుతోందని మండిపడ్డారు. దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రం లో కుట్ర పూరితంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కులం, మతం, ప్రాంతీయ విబేధాలను వైసీపీ ప్రోత్సహిస్తుందని నాగభూషణం ఆరోపించారు.
మంత్రి వెల్లంపల్లి మతి లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి మండిపడ్డారు. కుల, మత రాజకీయాలు తమకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో కుల ప్రాస్తావన తెచ్చి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు.
వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం ఆలయాలను కూలగొట్టారని చెబుతూ ఆనాడు వెల్లంపల్లి కూడా బీజేపీలోనే ఉన్నాడనే విషయం మరచి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాకే హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని సత్యమూర్తి హెచ్చరించారు.
‘
More Stories
జగన్ పై దాడి కేసులో నిందితునిగా బోండా ఉమా!
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
సీఎం జగన్ను హత్య చేసేందుకే దాడి