
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్-అమెరికా మధ్య ఐదో రౌండ్ చర్చలు ముగిశాయి. వాషింగ్టన్లో జులై 14 నుంచి నాలుగు రోజులు పాలు ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత అధికారి తెలిపారు. భారత్ బృందం తిరిగి వస్తోందని చెప్పారు. వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్, భారత్ బృందానికి చీఫ్ నెగోషియేటర్గా వ్యవహరించారు. ఈ ఐదో దశ చర్చల్లో వ్యవసాయం, ఆటోమొబైల్ సంబంధిత అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని సమాచారం.
వాటితోపాటు నాన్- మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను ఎదుర్కొవడానికి మార్గాలు, స్పెషల్ కెమికల్స్, ఆర్గానిజమ్స్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, టెక్నాలజీస్ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది. వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారీఫ్ల్లో రాయితీలు ఇవ్వడానికి భారత్ ఇష్టపడటంలేదు. అసలు భారత్ ఈ రంగాల్లో ఏ దేశానికి ఎలాంటి రాయితీలు కల్పించలేదు. అయితే వ్యవసాయానికి సంబంధించిన ఏ అంశాలను కూడా వాణిజ్య ఒప్పందంలో చేర్చవద్దని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
మరోవైపు భారత్, 26 శాతం టారిఫ్లను అమెరికా తొలగించాలని కూడా బలంగా కోరుతోంది. ఇక స్టీల్పై 50శాతం, ఆటో సెక్టార్పై 25శాతం పన్ను తొలగించాలని కోరుతుంది. వీటికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కును భారత్కు ఉందని ఉందని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా టెక్ట్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, పాస్టిక్లు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్లు వంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్కు సుంకాల విషయంలో భారత్ రాయితీ కోరుతోంది.
భారత్ పూర్తి స్థాయి ద్వైపాకిక్ష వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ట్రంప్ అదనపు టారిఫ్లు ఆగస్టు 1వ తేదీ నుంచే అమలు కానున్నాయి. ఈ లోపే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం కోసం ఈ చర్చలు కీలకం కానున్నాయి. భారత్తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్ 2న విధించే అధిక సుంకాల 26శాతం గురించి ప్రకటించారు.
ప్రస్తుతం అమెరికాతో అనేక దేశాలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపుతున్నందున్న అధిక సుంకాల అమలును జులై 9 వరకు 90రోజుల పాటు తాత్కాలిక వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టు 1 వరకు పొడిగించారు. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లకు చేరాయి.
More Stories
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్