
ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్లో ఓడినా రెండో క్వాలిఫయర్లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్కు మొదటి సారిగా అర్హత సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఈ విజయంతో పంజాబ్ మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోరుల, 8 సిక్సర్లతో 87 పరుగులతో రప్ఫాడించాడు.
శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 87*, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్కు తోడు నెహల్ వధెర (48), జోష్ ఇంగ్లిస్ (38) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వరుణుడి ఆటంకంతో రెండు గంటల పాటు ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై జట్టులోని హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (29 బంతుల్లో 44, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చి మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోగా జానీ బెయిర్ స్టో (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37, 7 ఫోర్లు) దూకుడుగా ఆడారు.
ఈ మ్యాచ్లో 204 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పంజాబ్ 3వ ఓవర్లో తన మొదటి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్ బోల్ట్ బౌలింగ్లో టోప్లేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లీష్, ప్రియాన్ష్ ఆర్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రియాన్ష్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 20 పరగులు చేసి ఆశ్విని కూమార్ బౌలింగ్లో హర్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
72 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్లో జోష్ ఇంగ్లీష్ బేయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జోష్ ఇంగ్లీష్ 5 ఫోర్లు, 2 ఫోర్లతో 38 పరగులు చేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ ఆయ్యార్, నెహ్యాల్ వధేరా పంజాబ్ను ఆదుకున్నారు. 47 బంతుల్లో 84 పరగులు చేశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. మూడో ఓవర్లో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టబోయి విజరు కుమార్కు క్యాచ్ ఇచ్చి 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే, జానీ బెయిర్ స్టో (38), తిలక్ వర్మ (44) రెండో వికెట్కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిర్మించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు