
బిఆర్ఎస్, కాంగ్రెస్ నడిపే సినిమాలో కెసిఆర్ను జోకర్గా మార్చారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమా ను నడుస్తోందని తెలిపారు. కవిత ఎపిసోడ్తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? అని మీడియా కూడా ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని ఆయన ఆరోపించారు. పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014లో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పి) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని, యాసంగి వడ్లకు సంబంధించి రైతులు ఎన్ని బాధలు పడ్డరో కళ్లారా చూసినం అంటూ ధ్వజమెత్తారు. వానలతో పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోతుంటే కనీసం టార్పాలిన్లు కూడా ఇయ్యకుండా రైతులను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది