
కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత అతను హార్డ్కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచారణలో తేలింది. కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ఏడు ప్రధాన హింసాత్మక సంఘటనలతో అతను నిందితుడు.. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ మరింత దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు ఏవోబీ ప్రాంతంవైపు కూడా పెద్ద ఎత్తున దృష్టిసారించారు భద్రతా బలగాలు.
హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటాకీ, బ్యాటరీ, రెండు కత్తులు, గొడ్డలి, నాలుగు టార్చ్ లైట్లు, ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం