
ఫోన్ సంభాషణలో ప్రస్తుతం భారత్- పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు ఇషాక్ దార్ వివరించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ చాలా సంయమనంతో ఉందని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని వాంగ్ యీ కొనియాడారు. చైనా-పాక్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై చైనా విదేశాంగ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనిపై వాంగ్ యీ స్పందిస్తూ, ‘పాక్-చైనా స్నేహం ఉక్కు కవచం లాంటిది. చైనాకు పాక్ వ్యూహాత్మక భాగస్వామి. ప్రాదేశిక సమగ్రత, స్వతంత్రత, తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవటంలో పాక్కు చైనా అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు. తమ మిత్రదేశమైన పాకిస్థాన్కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామిగా ఉంటుందని, తమ స్నేహ బంధం విడదీయరానిదని వాంగ్ యీ పేర్కొన్నారు.
మరోవైపు ఇషాక్ దార్, యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించడానికి అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అలాగే తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో మాట్లాడిన ఇషాక్ దార్ ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వివరించారు.
More Stories
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
పాక్ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
భారీ వర్షాలకు నేపాల్ లో 51 మంది, డార్జిలింగ్ లో 23 మంది మృతి