
కాగా, పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్ను వెనకేసుకొచ్చారనే ఆరోపణలపై అస్సాం ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం అభియోగాల కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్ను, ఆ దేశ ప్రమేయాన్ని ఎమ్మెల్యే అమీనుల్ సమర్థిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
సోషల్ మీడియా సహా ఏ విధంగానైనా పాకిస్థాన్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు. అటువంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
మరోవంక, భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ ఒకరిని పాకిస్థాన్ రేంజర్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో బుధవారం మధ్యాహ్నం అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)ని పొరపాటున దాటిన పీకే సింగ్ అనే కానిస్టేబుల్ను వారు అదుపులోకి తీసుకున్నారు. 182 బీఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన సింగ్ పశ్చిమ బెంగాల్ వాసి. ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ జరిపారు.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు