బెంగాల్ మండిపోతుంటే మౌనమేల మమతా!

బెంగాల్ మండిపోతుంటే మౌనమేల మమతా!
వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మమత బెనర్జీ తనకు ఏమీ పట్టనట్టుగా ఉన్నారని అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారని పేర్కొంటూ లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను సృష్టించేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి అరాచకాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని యోగి అస్పష్టం చేశారు. నిరసనకారులను ఆమె శాంతిదూతలుగా భావిస్తారని, కానీ హింసకు అలవాటుపడితే వారు ఆమె మాటలను కూడా లెక్క చేయరని ఆయన హెచ్చరించారు.

“రాష్ట్రాన్ని తగలబెట్టే వారికి స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇది,” అని మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీలు ఇలా జరుగుతున్న ఘటనలపై మౌనంగా ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.”వాళ్ల మౌనం వారికి మద్దతుగా భావించాలా?” అని ప్రశ్నించారు.  పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బెంగాల్‌కు భద్రతా దళాలను పంపిన కేంద్ర ప్రభుత్వానికి యోగి కృతజ్ఞతలు తెలిపారు

బెంగాల్ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఘాటుగా స్పందిస్తూ  నిరసనల పేరిట సీఎం మమతా బెనర్జినే బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని దీదీ చెప్పడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టారని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాల మధ్య ముర్షిదాబాద్ జిల్లా గట్టిగా నష్టపోతోందని, వాణిజ్యం నిలిచిపోయిందని,  రహదారులు మూసివేయబడ్డాయని, స్థానికులపై భయం ముస్తాబై ఉందని అంటూ కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారని చెప్పారు.