
డిన్నర్ చేసి తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద విహారానికి వెళ్లిన సమయంలో బైక్పై వచ్చిన వ్యక్తులు తమపై దాడి చేసినట్లు హోమ్స్టే ఓనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నది. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగారని, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారని చెప్పింది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వాళ్లు పర్యాటకులపై దాడి చేశారని, మహిళల్ని రేప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన తర్వాత బైక్పై పారిపోయినట్లు చెప్పారు. పర్యాటకుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారని, దాంట్లో ఓ ఇజ్రాయిలీ మహిళ ఉన్నట్లు కొప్పాల్ ఎస్సీ రామ్ అరసిద్ది తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసు డాగ్ స్వ్కాడ్ మిస్సింగ్ టూరిస్టు గురించి వెతుకుతున్నారు. అత్యాచారానికి గురైన మహిళలు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వాళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ధారంగా రేప్, గ్యాంగ్ రేప్, దొంగతనం కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించామని, రెండు స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్