
* నోరు మెదపని చైనా, డబ్ల్యూహెచ్వో
ఈ క్రమంలో చైనాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారని ప్రచారం జరిగినా అధికారికంగా దానినెవరూ నిర్ధారించ లేదు. ఈ వ్యాధి హెచ్ఎంపీవీ ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలతో ఉంటుందని, కరోనా వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.
ఇన్ఫ్లూయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా నిమోనియా, కరోనా వైరస్లు దేశంలో విజృంభిస్తున్నాయి. దవాఖానాలు రోగులతో నిండిపోతున్నాయి. శ్మశానాలకు కూడా తాకిడి పెరిగింది. నిమోనియో, వైట్ లంగ్ కేసులతో పిల్లల దవాఖానలు నిండిపోతున్నాయి’ అని ఎక్స్లో ఒక చైనా పౌరుడు పోస్ట్ చేశాడు.
కాగా, చైనాలో వ్యాధుల నియంత్రణ సంస్థను ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. తెలియని మూలకం ఉన్న నిమోనియా కోసం పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు కేసులు పెరిగే అవకాశం ఉందని తమకు తెలియజేసినట్టు వెల్లడించింది.
అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది నమోదైన కేసులు గత ఏడాది కన్నా తక్కువేనని ఒక వైద్యాధికారి తెలిపారు. హెచ్ఎంపీవీ వ్యాధి సోకిన వారు గుడ్డిగా యాంటీ వైరల్ డ్రగ్స్ వాడవద్దని, డాక్లర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాలని, దీనికి వ్యాక్సిన్ లేదని, అయితే జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని ఆయన తెలిపాడు.
హెచ్ఎంపీవీ, ఇతర వైరస్ వ్యాధుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కరోనా లాంటి మరో మహమ్మారి కబళించడానికి సిద్ధంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వెలువడే వరకు మనం దీనిని నమ్మాల్సిన అవసరం లేదు’ అని ఉన్నతాధికారి పేర్కొన్నారు.
‘కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అత్యవసర పరిస్థితిని ప్రకటించ లేదు. సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నట్టు కొత్త అంటు వ్యాధి కనుక వ్యాపిస్తున్నట్టయితే దాని గురించి అధికారులు హెచ్చరిక ప్రకటనలు జారీ చేసేవారు కదా?’ అని కొందరు పేర్కొంటున్నారు.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే