
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్లోనూ తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా… వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
గత నెల 22న ఛత్తీస్గఢ్ లోని భెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్ ఆరేషన్లో భాగంగా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 మంది మృతిచెందారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. మరోవైపు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుండి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. కొయ్యూరు ఎన్ కౌంటర్ కు పాతికేళ్ళు అవుతున్న నేపథ్యంలో వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు