
ఉక్రెయిన్ బలగాలను మరింత ముందుకు వెళ్లనీయకుండా అక్కడకు పెద్దయెత్తున సైనికుల మోహరింపు చేపట్టింది. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని సుజ్దా పశ్చిమ శివార్లలో రెండు దేశాల మధ్య సైనికుల మధ్య యుద్ధం జరుగుతున్నదని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. కుర్సు నుంచి 3 వేల మందికి వరకు ఇతర ప్రాంతాలకు తరలించినట్టు గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు రాకెట్ లాంచర్లు, ఆర్టిలరీ, ట్యాంకులు, హెవీ ట్రక్కులు వంటి ఆయుధాలను పంపిస్తున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ చేపట్టిన ఈ ఆపరేషన్కు సంబంధించిన ఉద్దేశంపై అస్పష్టత నెలకొన్నది. అయితే యుద్ధం ప్రారంభమైన 2022, ఫిబ్రవరి నాటి నుంచి ఉక్రెయిన్ తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు పెద్ద సవాల్గా మారిందనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే తాజా పరిణామంపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీని ద్వారా యుద్ధం నెమ్మదిగా రష్యా భూభాగంలోకి ప్రవేశించిందని ఆ దేశం గ్రహిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మైహైలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ఏమీ చెప్పనప్పటికీ, దానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తున్నదని భావిస్తున్నారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి 35 కిలోమీటర్ల వరకు వెళ్లాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ వార్(ఐఎస్డబ్ల్యూ) అనే సంస్థ పేర్కొన్నది.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి