ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద, విజయవాడలో భారీ వర్షం

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద, విజయవాడలో భారీ వర్షం
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది. 

పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో వరద ప్రవాహాన్ని గుర్తించడంలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ అధికారులు విజయవాడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వరద హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పులిచింతల నుంచి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలిరావాల‌ని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.

ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వ‌స్తున్న కార‌ణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో ఏర్పడిన సాంకేతిక ప్రమాం కార‌ణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చే అవకాశం ఉందని నది పరివాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరదలు హెచ్చరిక నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్దప్రాతిపధికన వాటిని పరిష్కరించుకొనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలియజేసారు. 3 షిఫ్ట్ లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కమిషనర్ వివరించారు.

కాగా,  తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

కాగా,  తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.