
గడ్చిరోలి జిల్లా అహెరి తహసీల్లో రూ. 10 వేల కోట్ల సుర్జాగడ్ ఇస్పాత్ సమీకృత ఉక్కు ప్రాజెక్టుకు శంకుస్థాపన నిమిత్తం వారు ముగ్గురూ గడ్చిరోలి వెళ్లారు. అజిత్ పవార్ ఈ ఉదంతాన్ని సభలో వివరించారు. తాము భద్రంగా దిగడానికి పైలట్ నైపుణ్యమే కారణమని ఆయన శ్లాఘించారు. ‘హెలికాప్టర్ మామూలుగా నాగపూర్ నుంచి గడ్చిరోలికి బయలుదేరింది. మా టేకాఫ్ తరువాత నేను మేఘాలు చూస్తూ సుఖంగా కూర్చున్నాను. వాటిని చూడవలసిందని ఫడ్నవీస్కు సూచించాను. అయితే, ప్రయాణంలో మబ్బుల వల్ల హెలికాప్టర్ దారి తప్పింది’ అని తెలిపారు.
అయినప్పటికీ ఫడ్నవీస్ నిబ్బరంగా ఉండి తనతో మాట్లాడుతూనే ఉన్నారని, తాను ఏమీ తోచని స్థితిలో పడి కలవరపడుతున్నానని చెప్పారు. అయితే, ఆందోళన చెందవద్దని, తనకు ఇంతకు ముందు ఆరు ప్రమాదాలు జరిగాయని, సురక్షితంగా బయటపడ్డానని ఫడ్నవీస్ తనతో చెప్పారని వెల్లడించారు. ఇప్పుడు కూడా సురక్షితంగానే ఉంటామని నాతోఆయన చెప్పారని పేర్కొన్నారు.
కలవరపడవద్దని తనతో ఫడ్నవీస్ పదే పదే చెప్పినట్లు అజిత్ పవార్ తెలిపారు. ‘భద్రంగా కిందకు దిగుతామా అనే ఆందోళనలో ఉన్నాను. కాని ఫడ్నవీస్లో ఏమాత్రం కంగారు లేదు. ల్యాండింగ్ ప్రదేశం కోసం చూస్తూ ఉండవలసిందని నాతో ఉదయ్ సామంత్ చెప్పారు. కిటికీలో నుంచి దానిని చూసిన తరువాత నాకు ఊరట కలిగింది’ అని అజిత్ పవార్ వివరించారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్