
అంతేకాదు, గత 10 నుంచి 20 సంవత్సరాలుగా డాలర్ పరంగా భారతదేశ ఈక్విటీ మార్కెట్ 10-12 శాతం చొప్పున నిరంతరం వృద్ధి చెందుతోందని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో ఈ ఈక్విటీ మార్కెట్లు 8-10 శాతం డాలర్ల రాబడిని అందజేస్తాయని, 2030 నాటికి భారతదేశ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ $10 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
ప్రస్తుతం భారత్ మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ ప్రపంచ సూచీలో భారత్ ఇప్పటికీ 1.6 శాతం (10వ ర్యాంక్) క్షీణతో ఉంది. అయితే మార్కెట్లో ప్రవాహం, కొన్ని అంశాల వల్ల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత 15 నుంచి 20 సంవత్సరాల చరిత్రలో మార్కెట్ రాబడులు, కొత్త లిస్టింగ్ల వల్ల 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది.
ఈ సందర్భంగా జెఫరీస్కు చెందిన మహేష్ నందూర్కర్ మాట్లాడుతూ, సంస్కరణల దిశగా తీసుకున్న కొన్ని చర్యల కారణంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశీయ పెట్టుబడుల పెరుగుదల కారణంగా భారతీయ మార్కెట్లో అస్థిరత తగ్గింని పేర్కొదన్నారు. విదేశీ పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులు పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
‘‘మార్కెట్ క్యాప్ పరంగా భారత్ ఐదో అతిపెద్ద దేశం అయినప్పటికీ, బ్లూమ్బెర్గ్ వరల్డ్ ఇండెక్స్లో దాని ర్యాంకింగ్ కేవలం 2.0% పెరుగుదలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ లెక్కన విదేశీ పెట్టుబడిదారులు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడిని పెంచడానికి విపరీతమైన అవకాశం ఉంది’’ అని జెఫరీస్ తన నోట్లో వెల్లడించింది.
అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు కూడా ఈ అంచనా వేయడం జరిగింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు