జహంగీర్‌పురిలో మరోసారి రాళ్ళ దాడి

జహంగీర్‌పురిలో మరోసారి రాళ్ళ దాడి

హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగిన రెండు రోజుల తర్వాత, సోమవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి నుండి రాళ్ల దాడికి సంబంధించిన తాజా సంఘటన నమోదైందని పోలీసులు తెలిపారు.

శనివారం ఘర్షణ జరిగిన ప్రదేశానికి సమీపంలో పైకప్పు నుండి రాజాగా రాళ్ళు, ఇటుకలు విసిరివేశారు.  సంఘటన తర్వాత పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులు ఆ ప్రాంతంలో రు. ఒకరినిఘర్షణలు విస్తరింపకుండా కట్టడి చేశారు. ఈ సందర్భంగా ఒకరిని  అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ (వాయువ్య) ఉషా రంగరాణి తెలిపారు.

“ఏప్రిల్ 16న జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లలో ఒక వ్యక్తి (నీలం రంగు కుర్తాలో) కాల్పులు జరుపుతున్నట్లు చూపించే వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. వాయువ్య జిల్లా నుండి ఒక పోలీసు బృందం సిడి పార్క్ రోడ్‌లోని అతని కోసం, అతని కుటుంభం సభ్యులను పరిశీలించడానికి అతని ఇంటికి వెళ్ళింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వారిపై రెండు రాళ్లు రువ్వారు. వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము.  ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, ”అని ఆమె వివరించారు.

నిందితుల్లో ఒకడైన సోనూ భార్యను పోలీసులు ఇంటరాగేషన్‌ పేరిట అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో యాభై మంది మహిళలు  పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు.  దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 
 
అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.  శనివారం అల్లర్లు జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే.. తాజా అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. మధ్యాహ్నం జరిగిన సంఘటనతో ఆ రోడ్డులో ఎవ్వరు ప్రవేశింపకుండా పోలీసులు, ఆర్‌ఎఎఫ్ , సిఆర్‌పి అడ్డుకున్నారు. కుశాల్ చౌక్ , చుట్టుపక్కల అల్లర్లు జరిపిన ప్రాంతాలలో ఆర్ఎఎఫ్, సిఆర్పీ సహా భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

ఆ కుటుంబం నివాసం ఉండే ఇరుకైన సందులోకి రాళ్లు విసిరారు. దీనిని అనుసరించి, అల్లర్ల గేర్‌లో ఉన్న భద్రతా సిబ్బంది లేన్‌లోకి ప్రవేశాన్ని మూసివేశారు.  నెమ్మదిగా మీడియా సిబ్బందిని కుశాల్ చౌక్‌కు బయటకు నెట్టివేసి, ప్రధాన రహదారిని బారికేడ్‌లతో మూసివేశారు.
అల్లర్లలో ప్రమేయం ఉన్నందుకు ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు.