శ్రీలంకతో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

శ్రీలంకతో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. చ‌రిత్రాత్మ‌క‌మైన 600వ టెస్టులో 165 ప‌రుగుల తేడాతో గిల్ సేన విజ‌యాన్ని సాధించింది. భార‌త స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి లంక‌ను దెబ్బ‌తీశాడు. 372 ర‌న్స్ టార్గెట్‌తో చేజింగ్ మొద‌లుపెట్టిన శ్రీలంక త‌న రెండో ఇన్నింగ్స్‌లో 206 ర‌న్స్‌కే ఆలౌటైంది. 

ఈ మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో 167 ర‌న్స్ చేయ‌గా, ఇక బౌల‌ర్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌లో క‌లిపి ప‌ది వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజా విక్ట‌రీతో రెండు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన లంక బ్యాట‌ర్ దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లో 84 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.

372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. సొనాల్ దినుష (84 పరుగులు), ధజంజయ డి సిల్వా (59 పరుగులు) మాత్రమే పోరాడారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ విజయంతో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో భారత్ 1-0తో లీడ్​లోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 23న ప్రారంభం కానుంది.

 
కానీ, భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలోనే కొనసాగుతోంది. భారత్ పర్సంటేజీ మాత్రం 48.15 నుంచి 53.33కు పెరిగింది. అదే సమయంలో శ్రీలంక 41 నుంచి 33.33 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ ఐదో ప్లేస్​లో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, బంగ్లాదేశ్ మాత్రం భారత్ కంటే మెరుగైన ప్లేస్​లో ఉంది. ఆ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో  ప్రస్తుతం 66.67 పాయింట్ పర్సంటేజీతో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 77.78 శాతంతో ​టాప్​లో ఉంది. సౌతాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది.
ఆసీస్​పై బంగ్లాదేశ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్​కు అర్హత సాధించాలంటే భారత్​కు ఇకపై ఆడనున్న ప్రతి టెస్టు నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎనిమిదింట్లో ఏడు నెగ్గి ఒకటి ఓడిపోతే అప్పుడు భారత్ 68.52 పర్సంటేజీతో ఉంటుంది. అదే ఆరు టెస్టుల్లో విజయం సాధించి రెండు మ్యాచ్​ల్లో పరాజయం పాలైతే పాయింట్ పర్సంటేజీ 62.96 గా ఉంటుంది. భారత జట్టుకు ఎటువంటి పెనాల్టీ పాయింట్లు విధించకపోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయి. కాబట్టి, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమ్ఇండియా రాబోయే సిరీస్​ల్లో పొరపాట్లకు ఏమాత్రం తావు లేకుండా ఆడాల్సి ఉంటుంది.