శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. చరిత్రాత్మకమైన 600వ టెస్టులో 165 పరుగుల తేడాతో గిల్ సేన విజయాన్ని సాధించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి లంకను దెబ్బతీశాడు. 372 రన్స్ టార్గెట్తో చేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో 206 రన్స్కే ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్లో 167 రన్స్ చేయగా, ఇక బౌలర్ సుతార్ రెండు ఇన్నింగ్స్లో కలిపి పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా విక్టరీతో రెండు టెస్టుల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన లంక బ్యాటర్ దినుషా.. రెండో ఇన్నింగ్స్లో 84 రన్స్ చేసి ఔటయ్యాడు.
372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. సొనాల్ దినుష (84 పరుగులు), ధజంజయ డి సిల్వా (59 పరుగులు) మాత్రమే పోరాడారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ విజయంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0తో లీడ్లోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 23న ప్రారంభం కానుంది.

More Stories
శ్రీనగర్ లో అమెరికా రాయబారి వ్యాఖ్యలపై పాక్ నిరసన!
హాకీ ప్రపంచకప్ లోపాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
పిల్లల భద్రతపై కాలిఫోర్నియాలో కీలక వాజ్యం ఎదుర్కొంటున్న మెటా