ఇండోనేసియాలోని మదురా ద్వీపంలో ఒక ఫెర్రీ అగ్ని్ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 41 మంది గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఫెర్రీలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఆదివారం, ఇండోనేసియా తీరంలో జరిగింది. ఈస్ట్ జావా ప్రావిన్స్ నుంచి ఒక ఫెర్రీ దక్షిణ సులావేసిలోని మకస్సార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఫెర్రీలో, కొన్ని గంటల తర్వాత ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో ఫెర్రీ సిబ్బంది ఇండోనేసియా ఎమర్జెన్సీ సర్వీసెస్కు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు ఫెర్రీ వద్దకు చేరుకుని, ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి. మొత్తం 225 మందిని రెస్క్యూ టీంలు కాపాడాయి.
“క్షేత్రస్థాయి నుండి అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రమాద స్థలానికి సమీపంలో ప్రయాణికులు నౌకల ద్వారా తరలింపు కోసం వేచి ఉన్నారు,” అని రవాణా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ముహమ్మద్ మష్యుద్ ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. తరలింపు ప్రక్రియ వేగంగా, సురక్షితంగా, సమర్థవంతంగా జరిగేలా చూసేందుకు మేము సంబంధిత వర్గాలన్నింటితో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాము.” అని ప్రకటించారు.
ఇండోనేషియాలోని రెండవ అతిపెద్ద నగరమైన తూర్పు జావాలోని సురబయ నుండి దక్షిణ సులవేసిలోని మకాసర్కు ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగాయి. నౌకలో మంటలు చెలరేగిన తర్వాత దాని నుండి పొగలు వస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు మరియు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఫెర్రీలో అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
“ప్రజలను సురక్షితంగా తరలించేందుకు తొమ్మిది నౌకలను పంపించాము,” అని సుమెనెప్ పోలీస్ ప్రజా సంబంధాల అధికారి విడియార్తి చెప్పినట్లు ఇండోనేషియాకు చెందిన ‘అంతరా’ వార్తా సంస్థ పేర్కొంది. “రెస్క్యూ బృందానికి సహాయపడేందుకు సమీప ప్రాంతాల నుండి పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించాము” అని తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులోని ప్రయాణికులు ఫెర్రీ ముందు భాగానికి వచ్చి సహాయం కోసం అర్థించారు. అక్కడే ఉన్న నౌకల వారిని సహాయం అడిగారు. గత ఏడాది కూడా ఇండోనేసియాలో ఒక ఫెర్రీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 150 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఇటీవలి కాలంలో ఇండోనేసియాలో ఫెర్రీలు అనేకసార్లు అగ్నిప్రమాదాలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

More Stories
బాక్సింగ్లో ఏకంగా 7 పసిడి పతకాలు
కీవ్పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి.. 9 మంది మృతి
పాకిస్తానీయులు మెచ్చిన ‘రామాయణ’