శత్రుత్వాలను అంతం చేయడానికి జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో తన తొలి సంభాషణలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం “ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి” నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భారతదేశ ఇంధన దిగుమతులకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో “నౌకాయాన స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను” ఆయన నొక్కి చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసిన, ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఇరాన్ ప్రకటన ప్రకారం, ప్రధానమంత్రి మోదీ “భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న రాబోయే బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరాన్ అధ్యక్షుడిని లాంఛనంగా ఆహ్వానించారు. ఈ సమావేశం సభ్య దేశాల మధ్య బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు”.
ఇటీవలి యుద్ధంలో సుప్రీం లీడర్, పలువురు ఇరాన్ అధికారులు, పౌరులు అమరులైనందుకు భారత ప్రభుత్వం, ప్రజల తరఫున మోదీ సంతాపం, సానుభూతిని తెలియజేశారని ఇరాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అమరుడైన ఇస్లామిక్ విప్లవ నాయకుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత్ ఒక ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపుతుందని కూడా ఆయన ప్రకటించారు.
ఫిబ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీకి నిర్వహించే ప్రభుత్వ లాంఛనాలతో కూడిన అంత్యక్రియలకు పెజెష్కియాన్ మోదీని ఆహ్వానించిన కొద్ది రోజులకే ఈ ఫోన్ సంభాషణ జరిగింది. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న టెహ్రాన్లో ప్రారంభమవుతాయి, జూలై 9న ఆయన స్వస్థలమైన మషద్లో ఖననం చేస్తారు.
దాదాపు అవే తేదీలలో మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరాల్సి ఉన్నందున, ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోవచ్చు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా వెళ్లే అవకాశం ఉంది. భారత ప్రతినిధి బృందానికి నాయకులుగా బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత హస్నైన్ (రిటైర్డ్), విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటలను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఫోన్ సంభాషణ అనంతరం, ‘ఎక్స్’ వేదికగా మోదీ ఇలా పేర్కొన్నారు: “పశ్చిమ ఆసియాలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో మాట్లాడాను. చర్చల్లో సాధించిన పురోగతిని స్వాగతించడంతో పాటు, నిరంతర ప్రయత్నాలు ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాను. భారత్కు మరి,యు ప్రపంచానికి హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానం యొక్క ప్రాముఖ్యతను మరోసారి నొక్కిచెప్పాను.”

More Stories
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. కేంద్రం అప్రమత్తం
ఎస్ఐఆర్ పై సీజేఐకు ఫిర్యాదులో కాంగ్రెస్ తో చేరిన డీఎంకే, ఆప్
అయోధ్యలో సిసిటివిలు పర్యవేక్షించే ఆర్ఎంఓ అర్జున్ దేవ్ బదిలీ