ఒక ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో, టిన్సుకియా జిల్లాలో నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్) [ఉల్ఫా(ఐ)]కు చెందిన ఇద్దరు క్రియాశీల కార్యకర్తలను అస్సాం పోలీసులు పట్టుకున్నారు. తద్వారా, భారీ ప్రాణనష్టం కలిగించేలా ప్లాన్ చేసిన ఉగ్రదాడిని భగ్నం చేశారు. జాగూన్ ప్రాంతంలో కేంద్ర ఏజెన్సీల సహకారంతో టిన్సుకియా పోలీసులు నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను నిర్వహించారు.
ప్రాథమిక విచారణల ప్రకారం, ప్రజలలో భయాందోళనలు సృష్టించే లక్ష్యంతో టిన్సుకియాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా హత్య చేయమని ఉల్ఫా(ఐ) ఈ ఇద్దరు నిందితులకు సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు అయిన కార్యకర్తలను స్వీయ-ప్రకటిత సెకండ్ లెఫ్టినెంట్ సియోర్ అసోం అలియాస్ హుమెన్జ్యోతి బారువా (27), స్వీయ-ప్రకటిత సెకండ్ లెఫ్టినెంట్ మనోజ్ అసోం అలియాస్ పాపు మోరన్ (30)గా గుర్తించారు.
పోలీసులు వారి వద్ద నుంచి రెండు ఏకే-56 రైఫిళ్లు, 172 రౌండ్ల సజీవ తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక మెడికల్ కిట్, సిరంజిలు, ఓపియాయిడ్లు, అడవిలో జీవించడానికి అవసరమైన ఆహార సామాగ్రి, బ్యాక్ప్యాక్లు, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
“టిన్సుకియాలో ఒక ఉగ్రదాడిని నివారించాం. నిన్న, కేంద్ర ఏజెన్సీల సహాయంతో టిన్సుకియా పోలీసులు నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా జగున్ వద్ద ఇద్దరు చురుకైన ఉల్ఫా(ఐ) కార్యకర్తలను అరెస్టు చేశాం,” అని పోలీసులు తెలిపారు. “ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు, టిన్సుకియా పట్టణంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా హత్య చేయమని ఉల్ఫా(ఐ) వారికి పురమాయించినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది,” అని పోలీసులు జోడించారు.
పోలీసుల ప్రకారం, వారు ప్రణాళిక చేసిన కార్యాచరణ విధానం, ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించాలని చూస్తున్న బాహ్య శక్తుల ప్రభావాన్ని చూపిస్తుంది. ఉల్ఫా(ఐ) మయన్మార్లోని స్థావరాల నుండి పనిచేస్తుంది. దాని నాయకత్వం అక్కడే కేంద్రీకృతమై ఉందని భావిస్తున్నారు. గతంలో అనేక ఉగ్రవాద దాడులకు సాక్ష్యంగా నిలిచిన టిన్సుకియా, అస్సాంలో తిరుగుబాటు తీవ్రంగా ప్రభావితం చేసిన జిల్లాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఎగువ అస్సాంలోని టిన్సుకియా, దిబ్రుగ, చరాయిదేవ్ అనేవి రాష్ట్రంలోని మూడు “అశాంతి” జిల్లాలు. ఇక్కడ సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలులో ఉంది.

More Stories
మొహర్రం ఊరేగింపులో 30,000 మందిని చంపే కుట్ర?
ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్ రాదు
చైనా నుంచి ఎదురవుతున్న రక్షణ సవాళ్లపై భారత్ దృష్టి