* అమెరికా దిగ్బంధంతో చాబహార్ పోర్టు సమీపంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు ట్యాంకర్లు
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన చేసింది. హర్మూజ్ జలసంధిని తెరుస్తామని, అయితే తమ షరతులను అంగీకరించాలని స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. అణు కార్యక్రమంపై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ ఈ ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నారని అమెరికా అధికారులు వెల్లడించారు.
ఇరాన్ ప్రతిపాదనలను పాకిస్తాన్ వాషింగ్టన్కు లిఖితపూర్వకంగా అందించింది. ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా మూడు అంశాలను ఇరాన్ లేవనెత్తింది. మొదటిది హర్మూజ్ జలసంధిపై అమెరికా నిర్బంధాన్ని ఆపేయాలి. రెండోది ఇరాన్ రేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. మూడవది, యుద్ధం ముగిసిన తర్వాతే అణు కార్యక్రమంపై చర్చలు జరపాలని ఇరాన్ తెలిపింది. అమెరికా ‘అణు విషయాలపై చర్చలు మొదటి నుండే జరగాలి’ అని పట్టుబడుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఈ ప్రతిపాదన నచ్చలేదని ఒక అమెరికా అధికారి మీడియాకు తెలిపారు. ‘ఇరాన్ పతనం అంచున ఉందని ఇప్పుడే తెలిపింది. హర్మూజ్ను తెరవాలని వేడుకుంటుంది’ అని సోషల్ ట్రూత్లో ట్రంప్ వెల్లడించారు. మంగళవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ ‘ఇరాన్లో మత పెద్దల పాలన కొనసాగినంత కాలం అది అణ్వాయుధాల వైపు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ ముప్పును వెంటనే పరిష్కరించాలి’ అని బెదిరించారు.
మరోవంక, హోర్ముజ్ జలసంధిలో సుదీర్ఘ దిగ్బంధనం విధించే అవకాశంతో సహా, ఇరాన్పై దీర్ఘకాలిక సముద్ర ఒత్తిడి ప్రచారానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికను స్వల్పకాలిక చర్యల నుండి మరింత సుస్థిరమైన విధానానికి మారడంగా అభివర్ణిస్తున్నారు. కీలకమైన సముద్ర మార్గాలకు ఇరాన్ ప్రాప్యతను పరిమితం చేయడం, ప్రధాన ఇరాన్ ఓడరేవులతో ముడిపడి ఉన్న వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలిగించడం ద్వారా టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచాలని దీని లక్ష్యం.
అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్కు చెందిన చమురు ట్యాంకర్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో చాబహార్ పోర్టు సమీపంలో నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు, సముద్ర నిఘా సంస్థల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్కు వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో ఉన్న చాబహార్ పోర్టు అమెరికా దిగ్బంధ రేఖకు సమీపంలో ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గత వారం చివర్లో అక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు భారీ సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన అణు వ్యతిరేక సంస్థ, యునైటెడ్ అగైనెస్ట్ అణు ఇరాన్, సముద్ర గూఢచారి సంస్థ విండ్వార్డ్తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గత వారం అమెరికా నౌకాదళం అడ్డుకున్న రెండు భారీ చమురు నౌకలను మళ్లించినట్లు కూడా అమెరికా నేవీ వెల్లడించింది.
చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రవాణాలో లేదా సముద్రంలో నిల్వగా ఉన్న ఇరాన్ ముడి చమురు పరిమాణం సుమారు 15.5 కోట్ల బ్యారెల్స్గా ఉంది.
More Stories
గుజరాత్ మున్సిపోల్స్లో బిజెపి క్లీన్స్వీప్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా బిల్లుపై వెనక్కి తగ్గం
ఒపెక్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్న యూఏఈ