తదర్శకుడు ఆదిత్య ధర్, కథానాయకుడు రణవీర్ సింగ్లను ప్రశంసిస్తూ బ్లాక్బస్టర్ చిత్రం ‘ధురందర్ 2’ తన జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ అని భారత్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కొనియాడారు. ఈ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ భారత్ లో ఇలాంటి సినిమా అనుభవాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని స్పష్టం చేశారు.
దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిందని, ఒక్క నిమిషం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ధురందర్ 2’ పోస్టర్ను పోస్ట్ చేసిన విరాట్.. ” ఈ రోజే సినిమా చూశాను. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా అనుభవం భారత్ లో ఇంతకుముందెన్నడూ చూడలేదని కచ్చితంగా చెప్పగలను” అని చెప్పారు.
“దాదాపు 4 గంటలపాటు కనురెప్ప వేయకుండా చూశాను. నాలో ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తట్టిలేపింది. డైరెక్టర్ ఆదిత్యా ధర్ మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్. మీరు ఒక జీనియస్” అంటూ కోహ్లీ అభినందనలు కురిపించారు. “ఇక నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ రణవీర్ ఈ సినిమా తర్వాత మీరు ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించి ఉంది. అబ్సల్యూట్లీ వావ్! ” అని రాసుకొచ్చారు.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ దీని కథనం ఆకట్టుకునేలా ఉందని, దాని నిర్మాణంలో ఉన్న నిశితమైన పనితనాన్ని ఇది ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు. ఆదిత్య ధర్ను ట్యాగ్ చేస్తూ, అనుష్క ఇలా రాసింది: “మీరు ఎంత అద్భుతమైన సినిమా తీశారు! దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా తీయడానికి ఎంతో దృఢ సంకల్పం కావాలి. ఆసక్తికరంగా, లీనమయ్యేలా, ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఈ సినిమా మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మీరు ఎంతో మౌలికమైన, ఆత్మవిశ్వాసం గల చిత్రనిర్మాత.”
మరోవైపు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్ 2’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచే ప్రభంజనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ గణాంకాలను ట్రాక్ చేసే ‘ససీనీల్క్’ ప్రకారం,ఈ చిత్రం తన 20వ రోజున రూ. 10.10 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం తన కన్నడ, తెలుగు వెర్షన్లలో అత్యధికంగా 19% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళంలో 16%, హిందీలో 14%, మలయాళంలో 13% ఆక్యుపెన్సీని సాధించింది.
దీనితో, భారతదేశంలో ఈ చిత్రం సాధించిన మొత్తం వసూళ్లు రూ. 1,033.37 కోట్లకు చేరుకున్నాయి. ఆదిత్య ధర్ రూపొందించిన ఈ గూఢచారి థ్రిల్లర్ చిత్రం భారతదేశంలో రూ. 1,000 కోట్ల మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలవడం విశేషం. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, గౌరవ్ గేరా, రాకేష్ బేడి, సంజయ్ దత్, డానిష్ పండోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More Stories
లవ్ జిహాద్ కేంద్రాలుగా జిమ్నాజియంలు
ఇరాన్పై 2 వారాల పాటు దాడుల నిలిపివేత
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం