* ముంబైలో రాహుల్ గాంధీకి బిజెపి నల్ల జెండాల ప్రదర్శన
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుల నిరసన ప్రదర్శనకు ప్రతిస్పందనగా రాహుల్ గాంధీని ప్రత్యేకంగా చూపుతూ, కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీ, ముంబైలతో పాటు దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముంబైలో రాహుల్ గాంధీ కాన్వాయ్ వద్ద బిజెపి కార్యకర్తలు కూడా నల్ల జెండాలు ఊపారు.
యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మోసపూరితంగా భారత్ మండపంలోకి చొరబడి ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ఏఐ శిఖరాగ్ర సమావేశాన్ని అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొన్ని గంటల తర్వాత, బిజెపి యువజన విభాగం కార్యకర్తలు శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నివాసం వెలుపల ప్రదర్శన నిర్వహించారు. ఈ సంఘటన రాజకీయ ప్రత్యర్థుల మధ్య వివాదానికి దారితీసింది, కాంగ్రెస్ దేశ ప్రతిష్టను దిగజార్చిందని బిజెపి ఆరోపించింది.
ఇండోర్ లో బిజెపి నిర్వహించిన నిరసన సందర్భంగా కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. రాళ్ల దాడి కూడా జరిగింది. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు మోహరించారు. రాహుల్ గాంధీ ఉదయం ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, 2014 పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కావడానికి పొరుగున ఉన్న థానే జిల్లాలోని భివాండికి రోడ్డు మార్గంలో ప్రయాణించారు.
ములుండ్ టోల్ నాకా వద్ద బిజెపి మద్దతుదారుల బృందం నిరసన నిర్వహించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చొరవలను గాంధీ నిరంతరం వ్యతిరేకిస్తున్నారని, ఆయన దేశ ప్రతిష్టను దిగమింగుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. “ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రతిష్టను రాహుల్ గాంధీ నిరంతరం వ్యతిరేకిస్తారు. దేశానికి సంబంధించిన సమస్యలపై కూడా. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఐ సమ్మిట్లో భారతదేశ ప్రతిష్టను దిగజార్చే నినాదాలు చేశారు. అందుకే మేము ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపాము” అని బిజెపి మద్దతుదారుడు ఒకరు తెలిపారు.
అంతకుముందు రోజు ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా విలేకరుల సమావేశంలో ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ఈ నిరసనను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఈ అంతరాయంతో సంబంధం ఉన్న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శితో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
“ఇది ఒక ప్రయోగం కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. భారతదేశం బిజెపి కాకుండా గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం గుర్తించడంలో విఫలమైంది” అని పాత్రా ధ్వజమెత్తారు.
ఈ నిరసన ప్రతిపక్షాల “అహంకారం, నిరాశ”ని ప్రతిబింబిస్తుందని, భారతదేశం పట్ల కాంగ్రెస్ దృష్టి లోపాన్ని బయటపెట్టిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మండిపడ్డారు. నిరసనకు ప్రధాన నిర్వాహకులలో ఒకరైన నరసింహ యాదవ్తో రాహుల్ గాంధీని చూపించే ఫోటోను కూడా బిజెపి నాయకులు ప్రస్తావించారు. శివరాజ్ సింగ్ చౌహాన్, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, కిరెన్ రిజిజు వంటి ఇతర కేంద్ర మంత్రులు ఈ నిరసనను “సిగ్గుచేటు”, “రాజద్రోహం” అని అభివర్ణించారు. ప్రపంచ ఏఐ శిఖరాగ్ర సమావేశం రాజకీయ వేదికగా మారకూడదని స్పష్టం చేశారు

More Stories
ఢిల్లీ యువజన కాంగ్రెస్ అర్ధనగ్న నిరసన వెనుక కుట్ర
మూడు భారీ ఇరాన్ చమురు నౌకలను పట్టుకున్న భారత్
బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో జ్యూడిషల్ అధికారులు