ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక సోదాలు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టి గాలించగా తీవ్రవాది గుర్తించి మన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. వెంటనే భారత దళాలు ఉగ్రవాదిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ అయిన ఉస్మాన్ అనే ఉగ్రవాది మరణించాడు.
అతడివద్ద నుంచి ఎం4 ఆటోమేటిక్ రైఫిల్, ఇతర ఆయుధాల్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత, భద్రతా దళాలు కథువాలో మూడు ఉగ్రవాద స్థావరాలను కనుగొన్నాయి. బిల్లావర్లో నిర్వహించిన ఆపరేషన్లలో, చీకటి ముసుగులో తప్పించుకోగలిగిన ఉగ్రవాదులతో రెండు ఎన్కౌంటర్లు కూడా జరిగాయి.
కమాద్ నల్లా, కలాబన్, ధను పరోల్ అడవులలో దేశ వ్యతిరేక శక్తుల ఉనికి గురించి నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు, పోలీసులు, భద్రతా సిబ్బంది సంయుక్త బృందాలు అనుమానితులను గుర్తించి, వారిని మట్టుబెట్టడానికి పెద్ద ఎత్తున గాలింపు ఆపరేషన్ను ప్రారంభించాయి. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఫలితంగా రాత్రంతా కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు.

More Stories
చైనా నగరాలపై ప్లాస్టిక్ మేఘాలు!
కలుషిత తాగునీటితో ఇండోర్లో 24 మందికి అస్వస్థత
లష్కరే తోయిబాలో చేర్పిస్తున్న కీలక నిందితుడికి పదేళ్లు జైలు