ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి భారత్, చైనా సహా పలు ఐరోపా దేశాలు గైర్హాజరు అయ్యాయి. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనలేదు. బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదనకు యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, బహరెయిన్, పాకిస్థాన్, టర్కీ, హంగేరీ, మొరాక్కో, కొసావో, అర్జెంటీనా, పరాగ్వే దేశాలు ఆమోదం తెలిపాయి.
కొన్ని షరతుల ప్రకారం ఆ బృందంలో జతకలిసేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నే అంగీకరించారు. బోర్డ్ ఆఫ్ పీస్లో చేరేందుకు ఫ్రాన్స్, నార్వే దేశాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చైనాకు ఆహ్వానం వెళ్లింది. కానీ ఆ దేశం ఇంకా ఏమీ వెల్లడించలేదు. రష్యా మాకు శత్రువు కాబట్టి, ఆ బోర్డులో ఉండేది డౌటే అని జెలెన్స్కీ పేర్కొన్నారు. బోర్డు మీటింగ్కు హాజరుకావడం లేదని ఇటలీ ప్రధాని మెలోనీ తెలిపారు.
ఆ బోర్డుకు నిరవధిక చైర్మెన్గా ట్రంప్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆ బోర్డు క్రియేట్ చేసుకున్న తీర్మానం ప్రకారం ఆయన చాన్నాళ్లు ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్లో అల్లుడు జేర్డ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఉండనున్నారు.

More Stories
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్
గ్రీన్ల్యాండ్ స్వాధీనంకు మద్దతు ఇవ్వని దేశాలపై సుంకాలు రద్దు
బంగ్లాదేశ్ భారత్ లో మ్యాచులు ఆడాల్సిందే