ఉద్యోగ నియామక సమయంలో ఎటువంటి రిక్రూట్మెంట్ విధానాన్ని పాటించలేదు. క్విడ్ ప్రోకో కింద ఉద్యోగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలను యాదవ్ కుటుంబం ఖండించింది. రాజకీయ కుట్రతో తమపై ఆరోపణలు చేస్తున్నట్లు యాదవ్ ఫ్యామిలీ తెలిపింది. ఈ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. రూ. 600 కోట్ల ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసి అటాచ్ చేశారు.
ఓ క్రిమినల్ కంపెనీ తరహాలో లాలూ యాదవ్ కుటుంబం పనిచేసినట్లు జడ్జీ గోగ్నే తెలిపారు. ఉద్యోగ కల్పన ప్రక్రియను ఆస్తులు కూడబెట్టుకునే విధానంగా మార్చుకున్నట్లు లాలా కుటుంబంపై ఆరోపణ చేశారు. రైల్వే శాఖను వ్యక్తిగత సొత్తుగా లాలూ వాడుకున్నట్లు కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో 98 మంది నిందితులుగా ఉన్నారని, దాంట్లో 46 మందిపై నేరాభియోగాలు నమోదు చేస్తున్నామని, మరో 52 మందిని కేసు నుంచి డిశ్చార్జీ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
గతంలో, సీబీఐ ఈ కేసులోని నిందితుల స్థితికి సంబంధించి ఒక ధృవీకరణ నివేదికను సమర్పించింది. దాని ఛార్జిషీట్లో పేర్కొన్న 103 మంది నిందితులలో ఐదుగురు మరణించారని అందులో పేర్కొంది. ఈ కేసులో అధికారికంగా అభియోగాలను నమోదు చేయడం కోసం కోర్టు ఈ విషయాన్ని జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయమై వివరణాత్మక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

More Stories
ఇరాన్ రేవులో చిక్కుకున్న రూ. 2,000 కోట్ల భారత బాస్మతి బియ్యం
ట్రంప్ కు మోదీ ఫోన్ చేయకపోవడమే వాణిజ్య ఒప్పందంకు అడ్డా?
అమెరికాలో కొకైన్ తో పట్టుబడ్డ ఇద్దరు భారత డ్రైవర్లు