* అసోంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు
ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అసోంలోని తీవ్రత 5.1గా నమోదైంది. త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్కు 50కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా వివిధ చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. అసోంలో సోమవారం తెల్లవారుజామున 4:17గంటలకు భూకమి భూకంపించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ(ఎన్సీఎస్) పేర్కొంది.
అయితే భూకంపం కేంద్రం బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున ఉన్న మోరిగావ్ జిల్లాలో 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా వివిధ చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అంతుకుముందు తెల్లవారుజామున 3:30 సమయంలో త్రిపురాలో కూడా భూకంపం సంభవించింది. గోమటి అనే ప్రాంతంలో రిక్టార్ స్కేలుపై తీవ్ర 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
ఇదిలా ఉండగా జనవరి 3న నేపాల్లో రెండు భూకంపాలు నేపాల్ ప్రజలను వణికించాయి. ఉదయం 6:13 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతో తప్లేజంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. మళ్లీ ఉదయపూర్ జిల్లాలో రాత్రి 10:36 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది. దీని భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

More Stories
ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు
వైష్ణోదేవి సంస్థ మెడికల్ సీట్ల అనుమతి రద్దు!
31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు