ఖలీదా జియా అంత్యక్రియల్లో భారత ప్రతినిధి పాల్గొనడం మానవతా పరమైన గౌరవ సూచికగా మాత్రమే కాకుండా, రాజకీయ సందేశంగా కూడా భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునే అవకాశాలు ఏర్పడతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మరింత బలోపేతం అవుతాయా? ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, చైనా ప్రభావం వంటి అంశాలపై పరస్పర అవగాహన పెరుగుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
“ఖలీదా జియా మృతి చెందారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి. ఈ నష్టాన్ని భరించే శక్తిని దేవుడు ఆమె కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆ దేశ అభివృద్ధికి, రెండు దేశాల సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది” అని ఆయన ఎక్స్ లో తెలిపారు.
“2015లో ఢాకాలో ఆమెతో జరిగిన ఆత్మీయ సమావేశం ఇప్పటికీ గుర్తుంది. ఆమె దూరదృష్టి, వారసత్వం రెండు దేశాల సంబంధాలకు భవిష్యత్తులో కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని చెప్పారు.

More Stories
ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు ప్రారంభం
తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్