ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెటర్ అవార్డును స్వీకరించారు. ఢిల్లీలో శుక్రవారం ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బాల పురస్కారాన్ని ప్రతి ఏడాది అందజేస్తారు.
రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డు స్వీకరించే క్రమంలో క్రికెటర్ వైభవ్ ఇవాళ మ్యాచ్కు దూరం అయ్యాడు. వాస్తవానికి బీహార్, మణిపూర్ మధ్య ఇవాళ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరుగుతున్నది. కానీ ఆ మ్యాచ్లో వైభవ్ ఆడడం లేదు5 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి బాల్ పురస్కారాలు అందజేస్తారు. వైభవ్తో పాటు మొత్తం 19 మంది పిల్లలకు వివిధ రంగాల్లో అవార్డులను అందజేశారు.
సూర్యవంశీ ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్లో అతి పిన్న వయసులో (14 ఏళ్ల 23 రోజులు) అరంగేట్రం చేసిన క్రికెటర్గా ఘనత సాధించాడు. అలాగే ఈ టోర్నీలో తాను ఆడిన మూడో మ్యాచ్లోనే సూపర్ సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుపై 35 బంతుల్లోనే సెంచరీ అందుకొని ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్గానూ రికార్డ్ కొట్టాడు.
ఈ తర్వాత తన ఫామ్ కొనసాగిస్తూ వైభవ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, అండర్ -19 ఆసియా కప్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ సెంచరీలు నమోదు చేశాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. 84 బంతుల్లో 190 పరుగులు ఔరా అనిపించాడు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్స్లు ఉండడం విశేషం. అలా ఏప్రిల్ నుంచి ఈ ఏడాది వైభవ్ ఆడిన ప్రతీ టోర్నీలో తన మార్క్ చూపించాడు.
మీరు సాధించిన ఘనత యావత్ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని, ఇవాళ గుర్తింపు పొందిన ప్రతి చిన్నారి చాలా ముఖ్యమైన , విలువైన వ్యక్తులు అని, అలాంటి నైపుణ్యం ఉన్న పిల్లల వల్లే ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు వస్తున్నదని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

More Stories
తిరువనంతపురం మేయర్గా వీవీ రాజేశ్
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది