కాలుష్యంపై ఢిల్లీ మంత్రి ప్రజలకు క్షమాపణలు

కాలుష్యంపై ఢిల్లీ మంత్రి ప్రజలకు క్షమాపణలు
 ఢిల్లీలో గాలి నాణ్యతలు నిన్నటి కంటే ఈరోజు (బుధవారం)కి కొంత మెరుగుపడ్డాయి. అయినప్పటికీ గాలి నాణ్యతలు వెరీ పూర్‌ కేటగిరిలోనే కొనసాగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలో 328 వద్ద ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. మంగళవారం ఎక్యూఐ స్థాయిలు 377గా నమోదయ్యాయి. ఢిల్లీలో 30 వాతావరణ పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యతలు వెరీపూర్‌ కేటగిరీలోనే నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సమీర్‌ యాప్‌ తెలిపింది.