చంద్రుడు-సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యకాంతి చంద్రుడిపై పడదు. సూర్యుడు, భూమి, చంద్రుడు వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్న సమయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఆ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో, చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది.
మనం భూమిపై నుంచి చూసిన సమయంలో ఆ భాగం మొత్తం నల్లగా కనిపిస్తుంది. దాన్నే మనం చంద్రగ్రహణంగా పిలుస్తుంటాం. 2026లో తొలి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం తూర్పు యారప్, ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లో కనిపింది.
అలాగే, భారత్లోనూ ఈ గ్రహణం దర్శనమిస్తుంది. భారత కాలమానం ప్రకాణం సాయంత్రం 6.26 గంటలకు మొదలై.. 6.46 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం వ్యవధి కేవలం 20 నిమిషాలు మాత్రమే. రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం లేదు. రెండో గ్రహణం యూరప్, వెస్ట్ ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

More Stories
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్ జైలు తరలింపు
పార్లమెంటుపై ఉగ్రదాడికి 24 ఏళ్లు