ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించి వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.
త్వరలో టీటీడీ పరిధిలోని స్థానికాలయాలన్నింటిలో కూడా శ్రీవారి సేవను దశల వారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. శ్రీవారి సేవకులు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవ చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ, ఐఐఎం అహ్మదాబాద్, ఏపీ ప్రణాళిక విభాగం నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు
టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవ దహనం
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు