మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తాగునీటి కొరత, నాసిరకం ఆహారం, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల జాండిస్ వ్యాధికి గురవుతున్నామని, కొందరు మరణించారని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేస్తున్నట్లు వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు. విట్ కేంపస్లో మంగళవారం రాత్రి 3వేల మందికి పైగా విద్యార్ధులు ఆందోళనలకు దిగారని పోలీసులు తెలిపారు. కలుషితమైన ఆహారం, నీరు తాగడంతో అనేకమంది విద్యార్ధులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్ధులు అంబులెన్సుకు, బస్సుకు, మూడు కార్లకు నిప్పంటించారు.
హాస్టళ్ళను, ఛాన్సలర్ నివాసాన్ని, కేంపస్లోని ఇతర ప్రాంతాలను కూడా ధ్వంసం చేశారు. లేబరేటరీలు, సైన్స్ పరికరాలు, లిఫ్ట్లను, సిసిటివి కెమెరాలను, మెస్ను, ఆహారం స్టోరేజీ రూమ్లను కూడా విద్యార్ధులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో సమీప ప్రాంతాల్లోని స్టేషన్ల నుండి పోలీసులు కేంపస్కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అష్టా సబ్డివిజనల్ పోలీసు అధికారి అకాష్ అమల్కర్ తెలిపారు.

More Stories
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్కు వాయిదా