మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రం రానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 15న ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. అయితే చిన్న సాంకేతికలోపం తలెత్తడంతో ఈవెంట్కు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదని పేర్కొన్నారు.
”మా నాన్న నా దగ్గరకు వచ్చి ‘హనుమంతుడి వెనక ఉండి నడిపిస్తాడు’ అని చెప్పారు. ఇలా జరిగిన వెంటనే కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుంది. నా భార్య మీద కూడా కోపం వచ్చింది. ఇలానేనా ఆయన చేసేది అనిపించింది ” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
”నువ్వు సినిమా తీస్తే తీసుకో.. అది నీ ఇష్టం, దేవుళ్ళ పై ఇలా కామెంట్స్ చేస్తారా? అయిన దేవుళ్ళ పై నమ్మకం లేకుండానే దేవుడి పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నావా? సక్సెస్ తలకెక్కితే ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు దేవుళ్ళతోనే పెట్టుకున్నావ్ ? చూద్దాం నీ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా ముందుకు వెళుతుందా అనేది? మనుషులు తప్పు చేస్తే దేవుళ్ళను ఎందుకు నిందించడం ” అని రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఇంకొందరు ”అసలు నిన్ను ఎవరు సినిమాలు తియ్యమన్నారు? నువ్వు సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్ బాబు అని మేము చెప్పలేదుగా.. మళ్ళీ తీసి ఇలాంటి మాటలు అనడం దేనికి?” అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. వారణాసి టైటిల్పై కూడా వివాదం నెలకొంది. ఫిల్మ్ చాంబర్లో వారణాసి టైటిల్పై ఫిర్యాదు నమోదు అయింది. ఆ టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

More Stories
మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి
పాత రిజర్వేషన్ల విధానంలోనే డిసెంబర్ లో స్థానిక ఎన్నికలు
డాక్టర్ ఉమర్ నబీ రెండు `మిస్సింగ్ ఫోన్లు’ కీలకం!