ఎన్నికల ప్రకటన జరిగిన రోజే మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు మెహిదీపట్నంలో ఖబరస్థాన్ కోసం విలువైన ఆర్మీ స్థలాన్ని కేటాయించడం, ఎర్రగడ్డ కాలనీల మధ్య, బస్తీల మధ్య మరో స్థలాన్ని ఖబరస్థాన్కు ఇవ్వడం, ఇతర తాయిలాలతో ముస్లింలను బుజ్జగిస్తూ ఇతర వర్గాలను మాత్రం బెదిరిస్తోందని ఆయన మండిపడ్డారు.
బీజేపీని విమర్శించడం ద్వారా అబద్ధాలు మాట్లాడటం ద్వారా మజ్లిస్ పార్టీ మెప్పు పొంది ఓట్లు రాబట్టుకోవాలని కుట్ర పన్నుతోందని పేర్కొంటూ సన్న బియ్యం ఇవ్వడం మానేస్తామంటూ బెదిరింపులకు దిగడం సీఎం హోదాలో మాట్లాడటం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. ఇది ఉపఎన్నికలో ఓడిపోతామనే ఫ్రస్టేషనా? లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయమా? అని నిలదీశారు.
ఢిల్లీలో బడేమియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటేమియా రేవంత్ రెడ్డి దొందూ దొందే అంటూ ఆర్మీ అంటే వీళ్లిద్దరికీ ఎప్పుడూ చులకన భావమే, ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడటం అలవాటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడేవారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. పాకిస్తానోడు ముడ్డి మీద తంతే అంటూ సైనికులను ఉద్దేశించి మాట్లాడతారా? అంటూ నిలదీశారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంతలు పడిన ఆ రోడ్లలో రెండు కిలోమీటర్లు నడిచి ప్రజలను ఓటేయమని కోరాలని ఆయన సవాలు విసిరారు. ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తానంటూ పదేపదే చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఫాం హౌజ్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
తప్పుడు హామీలు ఇవ్వడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందని చెబుతూ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు.. అనేక బస్తీలు ఉన్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటిని అభివృద్ధి చేయకుండా గొప్పలు చెప్పుకొంటే సరిపోదని పేర్కొంటూ అనేక బస్తీల్లో వీధి లైట్లు కూడా వెలగట్లేదని, డ్రైనేజీ రోడ్లపై పారుతోందని విమర్శించారు. రోడ్లపై గుంతలు పడి నడవలేకపోతున్నారని పేర్కొంటూఈ పనులు చేసి అప్పుడు ఓటు అడగాలని స్పష్టం చేశారు.

More Stories
నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి