ఈ సేవల ద్వారా డ్రైవర్లు తమ సంపాదనలో ఎక్కువ వాటాను నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో తీసుకురావలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది పురుష, మహిళా డ్రైవర్లను ఇందులో భాగస్వామ్యం చేయనుంది.
ముంబయి, పుణే, భోపాల్, లఖ్నవూ, జైపుర్తో సహా 20 నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 2030 నాటికి సుమారు లక్షమంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే భారత్ టాక్సీ, ప్రైవేటు యాజమాన్యంలోని కార్పొరేషన్గా కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది. ఈ సేవలను సహకార్ టాక్సీ కోఆపరేటీవ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.
ఈ సహకార్ ట్యాక్సీని గతంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుందని, ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. టూవీలర్, ఆటోలు, ఫోర్ వీలర్లు సహకార్ ట్యాక్సీలో భాగంగా సేవలందిస్తాయని ఆయన చెప్పారు. ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.
ఈ సేవను ఉపయోగించడం ఓలా, ఉబర్ యాప్ను ఉపయోగించినంత సులభం. ముందుగా ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి “భారత్ టాక్సీ” యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం
శబరిమల బంగారం బళ్లారి నగల వ్యాపారికి విక్రయం