
ఈ ఫ్రేమ్వర్క్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం 18 వేలకుగాపైగా సీబీఎస్ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య కోర్సుగా అందిస్తున్నారు. ఏఐ, ఉద్యోగాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఏఐ కారణంగా సుమారు 20 లక్షల సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగైనా, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే 80 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
శిక్షణ పొందిన ప్రతిభను రేపటి ఆవిష్కర్తలు, పరిశోధకులుగా రూపొందించడానికి కంప్యూట్ మౌలిక సదుపాయాలు, డేటా లభ్యత ఎకానమీని సృష్టించడానికి ప్రతిపాదిత ఇండియా ఏఐ టాలెంట్ మిషన్, కొనసాగుతున్న ఇండియా ఏఐ మిషన్ మధ్య సన్నిహిత సహకారం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలతో పాటు నివేదిక సూచించింది.
ఏఐ రంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని, తగినంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే, ఏఐ రంగంలో భారత్ కేవలం తన ఉద్యోగులను కాపాడుకోవడమే కాకుండా, ప్రపంచ ఏఐ పటంలో నాయకత్వం వహించగలదని నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ భవిష్యత్తు నిర్ణయాత్మక చర్యపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
More Stories
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’