
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ కీలకమైన రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. యుద్ధరంగంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని స్పష్టం చేశారు. 2029 నాటికి రూ 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు సాధించాలని, రూ 50 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
“భారత్ ఇప్పటికే ఆధునిక సాంకేతిక రంగాలలో ముందంజలో ఉంది. కానీ దేశాన్ని అగ్రగామిగా మార్చడానికి కొత్త, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాల్లో మరింత అభివృద్ధి సాధించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు మూడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాలి. మొదటిగా కీలక రక్షణ సామర్థ్యాలలో ఉన్నత స్థాయి స్వావలంబన సాధించాలి” అని తెలిపారు.
“రెండవది, రక్షణ రంగంలో ప్రపంచ ఎగుమతిదారుగా మారాలి. మూడవది, ఆధునిక సాంకేతిక రంగాలలో భారత్ను ముందుకు తీసుకెళ్లేందుకు, కొత్త, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాల్లో పురోగతి సాధించాలి. ఈ మూడు లక్ష్యాలను చేరుకోగలిగితే, భారత్ను 2047 నాటికి వికసిత దేశంగా మాత్రమే కాకుండా, రక్షణ ఆవిష్కరణలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చవచ్చు’ అని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
ఆధునిక యుద్ధాలు సాంకేతికత ఆధారంగా మారిపోయాయని మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఈ మార్పును స్పష్టంగా చూశామని చెప్పారు. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు వంటి నాన్-కాంటాక్ట్ వార్ఫేర్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఫలితంగా సవాళ్లు, బాధ్యతలు రెండు కూడా పెరిగాయని చెప్పారు.
More Stories
స్మృతి కేంద్రంగా హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ జన్మించిన గృహం
మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం
‘మీపై దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది’