
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో సుపరిపాలన అందిస్తోందని, ‘అభివృద్ధి, వారసత్వం’ అనే మంత్రంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలకు సామాన్య ప్రజలకు చేరాలా చూడాలని పార్తీ కార్యకర్తలను ప్రధాని మోదీ కోరారు. “బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం కాదు, సేవ కోసం ఉంది. పార్టీ కార్యాలయాలు ఈ భావనను సజీవంగా ఉంచుతాయి. మన పార్టీ, మన ప్రభుత్వం దేశం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తూ, దేశాన్ని మోసాల నుంచి, భారీ కుంభకోణాల నుంచి విముక్తి చేశాం” అని ప్రధాని మోదీ చెప్పారు.
దేశ రాజధానిని మినీ ఇండియాగా ప్రధాని మోదీ అభివర్ణించారు. అందుకే ఇక్కడి ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రతి పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఢిల్లీతో బీజేపీ సంబంధాలు ప్రజల మనోభావాలు, నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని చెబుతూ జన్సంఘ్ రోజుల నుంచి తమ పార్టీ ఢిల్లీ నగరం కోసం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ బీజేపీ కార్యాలయం పండిట్ పంత్ మార్గ్లో కొనసాగింది.
గ్రౌండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ రూమ్, రెసెప్షన్, కాంటిన్ ఉన్నాయి. 300 సీట్లు కలిగిన ఆధునిక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో పార్టీ సెల్స్, సిబ్బందికి వసతి కల్పించారు. మూడో అంతస్తులో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీల కోసం గదులు కేటాయించారు. టాప్ ఫ్లోర్ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కోసం రిజర్వ్ చేశారు. రాష్ట్ర ఇన్చార్జ్ నేతలు, ఎంపీలకు ప్రత్యేక రూములు కేటాయించారు.
More Stories
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
బ్రిటిష్, నిజాంల చేతుల్లో నష్టపోయిన ఆర్ఎస్ఎస్
‘శుక్రాచార్య’గా అక్షయ్ ఖన్నా