
* 375 వస్తువులపై అమల్లోకి రానున్న తగ్గించిన జీఎస్టీ రేట్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు శ్లాబుల (5, 12, 18, 28) విధానంలో రెండింటిని (12, 28) కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5, 18 శ్లాబులు మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు, సేవలను ప్రభుత్వం ఈ రెండు శ్లాబుల్లోకే తీసుకొచ్చింది. విలాస వస్తువులపై 40 శాతం పన్ను విధించనున్నారు.
ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్ గూడ్స్పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు.
జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఆటోమెుబెల్స్ వినియోగదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18 శాతం, పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు అనేక సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే రోజువారీ వస్తువులు తలనూనె, సబ్బులు, షాంపులు, టూత్బ్రష్, టూత్పేస్ట్ వంటి వాటిపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడంతో వాటి ధరలు మరింత చౌకగా మారనున్నాయి.
సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. టీవీలపైనా సోమవారం నుంచి రూ. 2,500 నుంచి రూ. 85,000 వరకు ధరలు తగ్గనున్నాయి. స్కీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్జీ, పానసోనిక్ వంటి సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి.
ఏసీలమీద సగటున 4 వేల 500 వరకూ, డిష్వాషర్లపైన 8 వేల వరకు ధర తగ్గనుంది. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానసోనిక్, హైయర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా, ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.
ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట.
ఇప్పుడు ఎంతకు కొంటున్నారో కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది. ఇక పొగాకు, ఆన్లైన్ గేమింగ్స్, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు