
సేవా పక్వాడ్ కార్యక్రమం సమాజం పట్ల మన బాధ్యతను “సేవ” ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో మార్గనిర్దేశం చేస్తుందని ఆయన చెప్పారు. సెప్టెంబరు 17వ తేదీన బిజెవైఎం ఆధ్వర్యంలో జిల్లా/బ్లాక్ స్థాయిలో నిర్వహించే రక్తదాన శిబిరంలలో ప్రతి కేంద్రంలో కనీసం 75 మంది పాల్గొంటారని ఆయన తెలిపారు.
సెప్టెంబరు 28వ తేదీన విశిష్ట పౌరులకు (పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందినవారు, యూనివర్సిటీ ఛాన్సలర్స్, పబ్లిక్ సర్వీస్ లో సేవలందించిన పెద్దలు) సన్మానం జరుపుతారు. అక్టోబరు 2వ తేదీన మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు గ్రామాల్లో తయారు చేసిన కాటన్ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ ను సాధించే దిశగా చైతన్యం కల్పిస్తామని కొమురయ్య వివరించారు.
ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. .
“సేవా పక్షం అభియాన్” సందర్భంగా ఈ 15 రోజుల పాటు ప్రజలకు అభివృద్ధి, సామాజిక సేవ, ఆత్మ నిర్భరత, ఎన్విరాన్మెంట్ కేర్, యువత భాగస్వామ్యం అయ్యేలా వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు.
More Stories
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్కి చెందిన విద్యార్థి మృతి
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’