
“రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, బ్రెజిల్- అమెరికా నుంచి అధికంగా 50 శాతం టారిఫ్లను ఎదుర్కొంటున్నాయి. రష్యా, చైనా సహా మరికొన్ని దేశాలు భారత్పై అధిక సుంకాలను ఖండిస్తున్నాయి” అని అనంత నాగేశ్వరన్ గుర్తు చేశారు. అయితే, ఇటీవల జీఎస్టీ విధానంలో తీసుకొచ్చిన మార్పులు దేశంలో వినియోగాన్ని పెంచుతుందని భావిస్తున్నట్లు నాగేశ్వరన్ తెలిపారు. ఎగుమతి నష్టాలను భర్తీ చేసే పరిమాణంలో ఇది ఉంటుందా? అనేది ప్రశ్నని పేర్కొన్నారు.
ఈ సుంకాలు తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగితే ఉపాధి, జీడీపీ వృద్ధి పరంగా భారత్కు భారీ సవాళ్లు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తమ వస్తువుల ఎగుమతుల కోసం ఇతర మార్కెట్లను వెతకడం అంత సులువైన పని కాదని స్పష్టం చేశారు. “ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు భారతీయ ఎగుమతులపై అమెరికా ఎలాంటి సుంకాలు వేయలేదు. కాబట్టి ఈ ఏడాది (అదనపు 25 శాతం సుంకం) ప్రభావం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఉంటుంది. సుంకాలు-మినహాయింపులు, సుంకాలు- ప్రభావిత రంగాల గురించి అంచనాలు మారుతూ ఉంటాయి” అని తెలిపారు.
“కానీ దురదృష్టవశాత్తు అనిశ్చితి, మూలధన నిర్మాణం, ఉపాధిపై రెండో, మూడో రౌండ్ ప్రభావాల గురించి బహుళ అంచనాలు ఉన్నాయి. రెండో, మూడో మూడవ త్రైమాసికాలలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి