
వేర్పాటువాద ఉద్యమానికి ఆజ్యం పోసేందుకు ఐఎస్ఐ, ఇతర సంస్థల ప్రమేయం గురించి విశ్వసనీయ సమాచారాన్ని ఏజెన్సీ కనుగొన్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం అయ్యాయి. దర్యాప్తులో కశ్మీర్ ఉగ్రవాదులకు సరిహద్దుల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు చేరుతోందని ఆధారాలు లభించాయి. దేశ సమగ్రతను కాపాడటంలో తమ కట్టుబాటు ఇదే నిదర్శనమని ఎస్ఐఏ ప్రకటించింది.
అక్రమ వాణిజ్య సూత్రధారి పాకిస్తాన్లో ఉన్నాడని, పొరుగు దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థలు, “అధికారిక ఏజెన్సీలు” అతనికి మద్దతు ఇస్తున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రాష్ట్ర దర్యాప్తు సంస్థ ప్రతినిధి తెలిపారు. జమ్మూ, కాశ్మీర్లోని ఏజెంట్లకు క్రిప్టోకరెన్సీని పంపుతున్నారని, వారు సామూహిక హింస, ఉగ్రవాదాన్ని పెంచడం కోసం ఉగ్రవాద గ్రూపులు, వేర్పాటువాదుల మధ్య దానిని మరింత పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
“పాకిస్తాన్ సూత్రధారిని గుర్తించారు. అయితే, అతని వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని” ప్రతినిధి చెప్పారు. ఇప్పటివరకు హవాలా వంటి పద్ధతుల్లో నిధులు పంపినప్పుడు, ఎక్కడో ఒక దశలో మనీ ట్రయిల్ దొరికేది. ఆ ఆధారాలతో పాకిస్థాన్ ఉగ్ర నిధుల సంబంధం భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి. వేర్పాటువాదుల వెన్ను విరవడంలో ఈ ప్రయత్నాలు కీలకం అయ్యాయి.
అయితే క్రిప్టో లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతాయి. పంపినవారు, స్వీకరించినవారి వివరాలు బయటకు రావు. దీంతో దర్యాప్తు సంస్థలకు మూలాలు కనిపెట్టడం కష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి 2025లో పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా “పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్”ను ప్రారంభించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ చర్య అని ప్రకటించింది. కానీ దీని వెనుక ఉగ్ర నిధుల దారులు విస్తరిస్తున్నాయని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
అప్పటి నుంచి ఈ ధోరణి మరింత విస్తరించింది.భారత దర్యాప్తు సంస్థలు కూడా ఇటీవలి దాడుల్లో ఆధారాలు కనుగొన్నాయి. రామేశ్వరం కేఫ్ పేలుడు (2024), పుల్వామా దాడి (2019) వంటి కేసులలో ఉగ్రవాదులు క్రిప్టో వ్యాలెట్లు, డార్క్నెట్, చైనీస్ యాప్లు వాడినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. క్రిప్టోకరెన్సీ గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలకు మార్గం కావడంతో, ఉగ్రవాదులు దీనిని ప్రధాన సాధనంగా మలుచుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలకు ఇది పెనుసవాలుగా మారింది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే పోరాటంలో కొత్త సవాలు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ క్రిప్టో మార్గాన్ని వాడుతూ నిధులు పంపడం, భారత భద్రతా వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారం, కఠినమైన పర్యవేక్షణ తప్పనిసరి.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి