
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో ఏప్రిల్ 23న ఒక నెలపాటు భారత విమానాలు ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ నిషేధం విధించింది. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 30న పాక్ విమానాలు ఏవీ భారత గగనతలంలోనికి ప్రవేశించకుండా నిషేధం విధించడం జరిగింది. తర్వాత మే 23 వరకు, ఆ తరువాత జూన్ 23 వరకు ఆ నిషేధాన్ని పొడిగించింది.
మరోవైపు పాకిస్థాన్ కూడా ఇలానే చేస్తోంది. తాజాగా పాక్ మరోసారి ఈ నిషేధాన్ని ఒకనెలపాటు పొడిగించింది. దీని ప్రకారం పాకిస్థాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలతోపాటు, ఆ దేశ సైనిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. వాస్తవానికి భారత విమానాలపై గగనతల నిషేధాన్ని విధించడం వల్ల పాక్ ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఆగస్టులో పాక్ రక్షణ మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, ఎయిర్స్పేస్ మూసివేత వల్ల ఆ దేశానికి దాదాపు రూ.126కోట్ల మేర నష్టం వాటిల్లింది. అంతేకాదు ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో 4.10 బిలియన్ల పాకిస్థాన్ రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు రూ.126 కోట్లు) మేర నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా పేర్కొంది.
More Stories
హజారీబాగ్లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు